Wednesday, August 31, 2011

వినాయక చతుర్థి శుభాకాంక్షలు



బ్లాగు సోదరీ సోదరులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
 మట్టి వినాయకునికి జై 




Tuesday, August 23, 2011

బొమ్మాళీ పిలిచెన్

బస్సు రైల్వే ట్రాకును దాటింది. నా కళ్ళు లెఫ్ట్ సైడ్ లో వచ్చే బోర్డును, పాత కోటను వెతుకుతున్నాయి. సినిమాలోవి పూర్తిగా సెట్టిన్గులే అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. గద్వాల్ పట్టణం హైదరాబాద్ నుంచి సుమారు 190 km దూరం లో ఉంది. కర్నూలు కి అరవయ్ కిమీ, రాయచూరు నుంచి యాభయ్ కిమీ దూరంలో ఉంది. బెంగలూరు - హైదరాబాద్ ని కలిపే NH-7 నుంచి బహు సమీపంలో (15 కి మీ) ఉన్నది. రాయచూరు కి దగ్గరగా ఉండటం వలన ఇక్కడ కన్నడ మాట్లాడే వారు కూడా కనిపిస్తారు.



ఈ ప్రదేశానికి మూడొందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇండియన్ గజేట్ట్ లో గద్వాల్ ప్రస్తావన ఉంది. ఇక్కడ నేసిన చీరలకి ప్రపంచ ప్రసిద్ధమే. పట్టణానికి సరిగ్గా మధ్యలో కోట ఉంది. దీనిని 16 వ శతాబ్దంలో సోమనాధ్రి అనే రాజు నిర్మించాడు. పూర్తిగా మట్టి తో కట్టిన ఈ నిర్మాణం ప్రస్తుతం శిధిలావస్తలో ఉంది. కోట ప్రాంగణంలో జమలా దేవి గుడి, ప్రభుత్వ కాలేజీ ఉన్నాయి. అప్పట్లో కోట చుట్టూ నిర్మించిన కందకం ఇప్పటికి ఉంది. కాకపోతే దాన్ని సరిగా పట్టిచుకోకపోవడం వలన మామూలు నాలా లానే తయారయ్యింది.


కాలానుగునంగా కోట చుట్టూ ఉన్న ప్రదేశం వ్యాపార, ప్రభుత్వ కార్యకలాపాలకు అనుగుణంగా మారింది. మునిసిపల్ ఆఫీసు, కోనేరు కోటకు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఈ కోనేరులో ఇప్పటికీ స్వచ్చమైన నీరు లభ్యమవుతుంది. సాధారణంగా కొన్ని పట్టణాల్లో ఉన్న కోనేర్లు నిర్లక్ష్యానికి గురై చెత్త పారబోసే ప్రదేశాలుగా మారుతున్నాయి. మునిసిపల్ ఆఫీసు లో ఉన్నవాళ్లు పక్కనున్న కోనేరుని కూడా పట్టించుకోకపోతే ప్రజలేమనుకుంటారో అనుకున్నారేమో, దీనిని చక్కగా కాపాడుతున్నారు.


అక్కడక్కడ ప్రధాన రహదార్లపయి ఉన్న పాత నిర్మాణాలు మనల్ని ఆ కాలానికి తెసుకువెల్తాయి.పట్టణం పాతదవటం వలన రహదారులు ఒక సరియిన పాట్టేర్న్ లో అభివృద్ధి చెందలేదు. కొత్తవారు ఈ రోడ్లలో అయోమోయానికి గురవటం ఖాయం. కొన్ని రహదార్లు ఆటో కూడా పట్టనంత సన్నగా ఉన్నాయి. మునిసిపాలిటి వారు ఆ పాత రోడ్లనే సిమెంట్ రోడ్లుగా మార్చేసారు. పట్టణం అభివృద్ధి చెందే కొద్ది ఈ రహదార్లు ఒక తలనొప్పిగా మరే అవకాసం ఉంది. మరొక విశాదమేమంటే పరిణామ క్రమంలో ఈ రోడ్ల ఫై ఉన్న పాత ఇళ్ళని కొత్త ఇళ్ళు ఆక్రమిస్తున్నాయి, కానీ రోడ్ విడ్త్ మారడం లేదు. ఐతే పట్టాన శివార్లలో ఇప్పుడవుతున్న డెవలప్మెంట్ పధ్ధతి ప్రకారమే అవుతున్నట్టనిపిస్తోంది.


పట్టణంలో ఓపెన్ డ్రయినేజి వ్యవస్థ ఉంది. కొన్ని ఏరియాలలో క్లీనింగ్ రెగ్యులర్గా చేయకపోవడం వలన దుర్వాసన, రోగాలకు కారకులవుతున్నాయి. అయిజా, క్రిష్ణాగ్రహారం వెళ్ళే రూట్లలో కొన్నిఆయిల్ మిల్లులు, అనుప్లెక్ష్ గ్లాస్ కర్మాగారం ఉన్నాయి.

 పట్టణానికి 5 కిమీ దూరంలో ఉన్న క్రిష్ణాగ్రహారం కృష్ణా నది వొడ్డున ఉంది. బీచుపల్లి కూడా ఇక్కడకి దగ్గరే. పట్టాన శివార్లలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ డాం ఉంది. మరోవైపు ఉన్న బాలన్సింగ్ రెసెర్వొఇర్లో మన ప్రభుత్వ పర్యాటక సంస్థ బోటింగ్ ఏర్పాట్లు చేసింది. సాయంకాలం ఇక్కడ ఉన్నఆంజనేయస్వామి గుడిని దర్శించుకొని కొలనులో షికారు చేయడం ఒక మధురానుభూతి. పట్టణానికి ల్యాండ్మార్క్గా నిలచిన కోట గురించి సరియిన పరిరక్షణ చర్యలు తెసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Thursday, November 4, 2010

చీకటి వెలుగుల రంగేళి...........




          
బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

Sunday, October 31, 2010

5 గంటల్లో వెయ్యేళ్ళు వెనక్కి

కీ.శ.12 వ శతాబ్ద్హం:
ఒక శిల్పి పగలనక రేయనక కర్తవ్యమే దైవంగా బండరాళ్ళను అద్బుత శిల్పాలుగా మలుస్తున్నాడు.అతని అకున్ట్టిత దీక్ష ముందు రోజులు నిమిషాల్లా,సంవత్సరాలు రోజులల గడుస్తున్నాయి.ఆ శిల్పి జక్కనాచార్యుడు.అతను మలుస్తున్న అద్బుత శిల్ప సంపద బేలూరు లోని చేన్నకేశవాలయం.

                                                              **      **                   
గత కొంతకాలంగా వారాన్తాలను ఇంటి వద్దే వెళ్ళదీస్తున్న నాకు, మా కజిన్ తోడవ్వడంతో బేలూరుకి బయల్దేరాం.మార్నింగ్ ఎనిమిదింటికల్లా బెంగుళూరు లోని మేజేస్ట్టిక్ బస్సు స్టేషన్ కి చేరుకున్నాం.ఇక్కడనుంచి బేలూరుకి బస్సులు తక్కువగా ఉండటం చేత ముందు బెంగుళూరు-మంగుళూరు హైవే ఫై ఉండి బేలూరు కి దగ్గరలో ఉన్న హస్సన్ కి చేరుకున్నాం.హస్సన్ నుంచి బేలూరు కి ప్రయాణ సమయం గంట లోపే.మొత్తంమీద మధ్యానం ఒంటి గంట కల్ల బేలూరు లో ఉన్నాం.



బస్సు స్టాప్ నుంచి చేన్నకేశవాలయానికి నడిచే వెళ్ళవచ్చు.పది నిమిషాల్లో గాలిగోపురం ముందున్నాం. గాలిగోపురం దాటి లోపలికి అడుగుపెట్టగానే విశాలప్రాంగణం లోని దేవాలయ సమూహం కానవస్తుంది.ముందుగా ప్రధానమైన చెన్నకేశవాలయం లోనికి అడుగుపెట్టాం.


 

దీనిని హొయసాల విష్ణువర్ధనుడు,చోళ రాజులను ఓడించిన సందర్భ్హంగా కట్టించాడు.ఈ దేవాలయ శిల్పకళా సంపద చాలా అద్భ్హుతంగా అనిపించింది. దేవాలయాన్ని మొత్తం సోప్ స్టోన్ తో నిర్మించారు.ఈ  దేవాలయం లోని గర్భ్హగుడి నక్షత్రాకారం లో ఉండటం విశేషం.గుడిలోనికి తూర్పు,ఉత్తర,దక్షిణ దిశల నుంచి ద్వారాలున్నాయి.దేవాలయం లోని స్థంబాలను  కూడా చాలా హృద్యముగా చెక్కారు.


                     





దేవాలయం వెలుపల గోడలమీద దేవతా మూర్తులను కడు రమ్యముగా చిత్రీకరించినారు.ఈ దేవాలయాన్నిదర్శించడం ఒక అద్భుత అనుభవం.ఈ దేవాలయాన్ని పూర్తిగా చూసి ఆకళింపు చేసుకోవడానికి ఒక రోజు సరిపోదు.ఈ అద్బుత కళాసంపదను దర్శించి ఆనందంతో తిరుగుప్రయాణం అయ్యాం.

Saturday, September 11, 2010

మట్టి వినాయకుడిని పూజిస్తే చాలా...?!

ఈ వినాయక చవితి కి మట్టి వినాయకులనే పూజించాలని మీడియా లోను, బయట ప్రచారం బాగా జరిగింది. ఇది సక్సెస్ కూడా అయ్యింది. ఇలా చేయడం వలన పర్యావరణ పరిరక్షణ జరుగుతుందనేది ఎవరు కాదనలేనిది. సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితికి ఇలా చేస్తే సరిపోతుందా? మరి రోజురోజుకూ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్,అంతకంతకు తరుగుతున్న ఖనిజ సంపదల మాట ఏమిటి?

ఈ రెండు సమస్యలను పెంచి పోషిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం ఒకటి. మన దేశం లో సాధారణంగా 'పక్కా' బిల్డింగుల నిర్మాణం కోసం ఇటుకలు, ఇసుక, సిమెంటు, స్టీలును వాడతాం. వీటికి గ్లోబల్ వార్మింగ్కి సంబంధం ఏంటి? చాలా దగ్గర సంబంధం ఉంది.  ఇటుకలు, సిమెంటు, స్టీలు తయారుచేసే క్రమంలో విడుదలయ్యే CO2 గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేసే వాయువుల్లో  ప్రధానమయినది. ఇక ఇసుక సహజ సిద్దంగా లభించేదే అయినా,దీనిని నిర్మాణ ప్రదేశానికి తరలించే క్రమంలో విడుదలయ్యే వాయువు కూడా CO2 నే.

అలాగని బిల్డింగులు కట్టుకోకుండా కూర్ఛుంటామా ఏంటి అనుకుంటున్నారా?దీనికి ఒక సింపుల్ పరిష్కారముందండి. మట్టి వినాయకుల్ని పూజించినట్లు మట్టి ఇళ్ళను కట్టుకోవడమే.

















 మట్టి ఇళ్ళు మనకి కొత్తేం కాదు, గ్రామ ప్రాంతాల్లో సుపరిచితమే. వీటిలోని మూలాల్ని ఆకళింపు చేసుకుని, సాంకేతికతను జోడించి నేటి నిర్మాణ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దారు శాస్త్రజ్ఞులు, భవన రూప శిల్పులు. మట్టి ఇళ్ళకు, సిమెంట్ ఇళ్ళకు ముఖ్యమైన తేడాలు..

గోడలు: ఇంటిని నిర్మిద్దామనుకున్న స్థలం లోనే పునాదులు వేయడానికి తవ్విన మట్టిని టెస్టింగ్ కొరకు ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ ఆ మట్టి యొక్క సాంద్రతని పరిశీలించి అది నిర్మాణానికి పనికి వస్తుందో లేదో చూస్తారు. ఆ మట్టిని అనువయినది గా నిర్ణయిస్తే దానినే ఈ మట్టి ఇటుకల నిర్మాణం లో వాడతారు. 70 % మట్టి, 30 % సిమెంటు మిశ్రమంతో చేసిన ఈ మట్టి ఇటుకలను సూర్యరశ్మి లోనే 21 రోజులు ఎండ పెట్టి గోడల నిర్మాణములో వాడతారు. ఈ ఇటుకల తయారీ లో ఎక్కడా CO2 విడుదలయ్యే ప్రసక్తే లేదు.

స్లాబు: సాధారణ నిర్మాణాల్లో స్లాబు బరువంతా కాలమ్-బీముల మీదే సపోర్ట్ అయి ఉంటుంది. అందుకే స్లాబు స్థిరముగా ఉండేందుకు అధిక మొత్తం లో స్టీలు ని ఉపయోగిస్తారు. ఈ మట్టి ఇళ్ళలో స్టీలు వాడకాన్ని తగ్గించేందుకు డోములు, వాల్టులు, ఆర్చ్ పానెల్స్ లను వాడతారు. మన సాంప్రదాయ పెంకులు ఉండనే ఉన్నాయి.



ఫ్లోరింగు: దీనిలో కూడా మట్టి తో చేసిన టైల్స్ నే వాడతారు. ఇవి టెర్ర కొట్ట టైల్స్ గా సుప్రసిద్ధం.



నిర్మాణ వ్యయం: సాధారణ బిల్డింగులతో పోల్చితే ఈ మట్టి బిల్డింగుల వ్యయం 10 -15 % తక్కువ.

 మరి కొన్ని మట్టి ఇళ్ళ చిత్రాలు..



 ఈ పైన చిత్రాల్లో చూసిన ఇళ్ళు ఎక్కడివో కావండి, ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక లోనివే. మన రాష్ట్రం లో కూడా ఇప్పుడిప్పుడే వీటి నిర్మాణాలు పుంజుకుంటున్నాయి. మీరు వైజాగ్ వారయితే ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంటుని ఒక లుక్ వేసి రండి. వారి బిల్డింగ్ కూడా ఈ కోవలోనిదే..

మట్టి ఇళ్ళ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లంకెలు చూడండి...

Sunday, August 29, 2010

ఆఫీస్ ఇంటీరియర్స్..

కొన్నేళ్ళ క్రితం..........
ఆఫీసు అంటే ఒక పాత బంగాళా,లోపల టేబుల్ పైన ఫైల్సు, వాటి వెనుక ఆపసోపాలు పడుతూ పని చేసే గుమాస్తాలు, కిర్రు కిర్రు మంటూ శబ్దం చేసే ఫ్యాన్లు, ఈ మధ్యలో యూనిఫాం వేసుకుని అటు ఇటు హడావిడిగా తిరిగే బంట్రోతులు..
ఇప్పుడు...............
ఆఫీసు అంటే ఐదు నక్షత్రాల హోటల్సు ని తలపించే రిసెప్షన్, ఎంట్రన్సు లాబీలు,వైట్ కాలర్ ఉద్యోగులు,ఏసి ల నుంచి వీచే చల్లని పిల్లగాలులు, వీలయితే నాలుగు మాటలు,కుదిరితే కప్పు కాఫీ తాగటానికి ఫుడ్ కోర్ట్లులు,పని వత్తిడి నుంచి సేద తీరడానికి రిక్రిఏషన్ సెంటర్లు..     

కొన్నేళ్ళ క్రితం అలా ఉన్నఆఫీసుని ఇప్పటిలా మారిస్తే........

సాధారణముగా కార్పోరేట్ ఆఫీసులు బిల్డర్స్ నుంచి భవనాలను లీజుకి తెసుకుంటాయి. కావున లోపల ఇంటీరియర్స్ సదరు కంపెనీలే తమ తమ అవసరాలకు తగినట్లు ప్లాన్ చేచేయించుకుంటాయి. లీజు సమయం పూర్తైన తరువాత ఒక కంపెనీ మరో బిల్డింగ్ కు మారదామనుకుంటే మునుపు చేయించుకున్న ఇంటీరియర్స్ వృధా అవకుండా పూర్వపు మెటీరియల్స్ నే ఉపయోగించుకునేట్లు చూసుకుంటారు.దీని గురించి కొంచం వివరంగా చర్చిస్తే .......

1 .పార్టీషన్స్: సాధారణముగా ఇంటీరియర్ వర్క్స్ లో స్పేస్ ని డివైడ్ చేసుకోవడానికి ఇటుకలతో గోడలు కట్టరు. ఈజీ గా డిస్మాంట్ల్ చేయడానికి వీలుగా అల్యుమినియం సప్పోర్ట్స్ మీద MDF  బోర్డుని ఫిక్స్ చేసి దాని ఫై జిప్సమ్ తో ఫినిషింగ్ చేసి పైంట్ వేస్తారు. కానీ చూడడానికి మాత్రం మమూలు గోడల్లానే ఉంటాయి.


౨. ఫాల్స్ సీలింగ్: పేరు లోనే దీని అర్ధం ఉంది. ఏసి, ఎలక్ట్రికల్ ఫైపులను మనకు  బయటకు కనపడకుండా చేయడానికి ఇది సహకరిస్తుంది. సాధారణంగా ఇవి రెండు రకాలు. ఒకటి జిప్సమ్ సీలింగ్, రెండోది గ్రిడ్ సీలింగ్. జిప్సమ్ సీలింగ్ పార్టీషన్స్ లానే అల్యుమినియం సపోర్ట్స్ మీద జిప్సమ్ బోర్డుని ఫిక్స్ చేసి పెయింట్ తో ఫినిషింగ్ చేస్తారు.గ్రిడ్ సీలింగ్ సులభతరము ఐనది.దీన్ని ఈజీ గా నిర్మించచ్చు. ఈజీ గా డిస్మాంట్ల్ చేయొచ్చు.



3.కార్పెట్ ఫ్లోరింగ్: ఈ కార్పెట్ కూడా మాములు టైల్సు రూపం లోనే ఉంటుంది. అదేసివ్ తో వీటిని అతికిస్తారు.వీటిని కావాలంటే తొలగించి, వేరే చోట అతికించుకోవచ్చు. కాబట్టి వేస్ట్ అనేది ఉండదు.

ఇలానే వర్క్ స్టేషన్ లు. వీటిని కూడా ఎప్పుడు పడితే అప్పుడు  డిస్మాంట్ల్ చేసుకొని వేరే చోట మరల ఉపయోగించుకోవచ్చు. వాల్ పేపర్స్ కూడా రూముకి అందాన్ని తీసుకు రావడం లో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.


ఇవండీ టూకీగా ఆఫీసు  ఇంటీరియర్స్ విషయాలు..